మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించిన మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు
బీజేపీ మోసపూరిత మాటలను నమ్మొద్దు
తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి
భీమ్గల్ మున్సిపల్ నూతన చైర్పర్సన్ ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రి వేముల
భీమ్గల్, ఫిబ్రవరి 20: భీమ్గల్ అభివృద్ధికి మున్సిపల్ పాలకవర్గం సమన్వయంతో పనిచేయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. బీజేపీ నాయకుల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. టీఆర్ఎస్ కార్యకర్తలు అంటే క్రమశిక్షణ ఉన్నవారని పేర్కొన్నా రు. ఆదివారం భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతన చైర్పర్సన్గా ఎన్నికైన ప్రేమలతతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంతకు ముందు చైర్పర్సన్గా పనిచేసిన మల్లెల రాజశ్రీ కౌన్సిలర్ల సహకారంతో చాలాబాగా పనిచేశారని అభినందించారు. నూతన చైర్పర్సన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. 60 ఏండ్లలో జరగని అభివృద్ధి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కేవలం ఏడేండ్లలో జరిగిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అభివృద్ధి ఎందుకు జరుగడంలేదని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ సహకారంతో భీమ్గల్ను మున్సిపల్గా ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, భీమ్గల్ పట్టణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అవమానకరంగా మాట్లాడుతున్న ప్రధాని మోదీతో ఇక్కడి బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, సంజయ్, అర్వింద్ ప్రజలకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా విద్వేష పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న బీజేపీ ఇక్కడి ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మోయిజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ భగత్, సొసైటీ చైర్మన్లు నర్సయ్య, వెంకటేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.