డిచ్పల్లి, అక్టోబర్ 23 : జక్రాన్పల్లి మండలంలోని చింతలూర్ గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ దారుడు, ఉత్తమ రైతు నాగుల చిన్ని కృష్ణుడికి జాతీయ పురస్కారం లభించింది. చిన్ని కృష్ణుడు ఎకరం పొలంలో తల్లిదండ్రుల చిత్రం వచ్చేలా మూడు రకాల వరి వంగడాలను సాగు చేయడంతో నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ పురస్కారం ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారు. అదే విధంగా పొలంలో చిన్ని కృష్ణుడి తల్లిదండ్రు ల చిత్రాలను అద్భుతంగా చిత్రించిన నిజామాబాద్కు చెంది చిత్రకారుడు మహదేవ్ను సైతం జాతీయ పురస్కారంతో సత్కరించా రు.
గత నెలలో ఐదు ప్రపంచ రికార్డులు అం దుకున్న చిన్ని కృష్ణుడి ఖాతాలో మరో జాతీయ పురస్కారం చేరడంతో చింతలూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, జస్టిస్ చంద్రయ్య, జస్మత్ భాయ్ పటేల్, చంద్రవతన్ పాల్గొన్నారు.