కామారెడ్డి, మార్చి 19 : కామారెడ్డి ప్రభుత్వ దవాఖాన కేంద్ర ప్రభుత్వం ప్రకటించే లక్ష్య కార్యక్రమానికి ఎంపికైంది. లేబర్ రూములు, ఆపరేషన్ థియేటర్లలో ఉత్తమ ప్రమాణాలను పాటించే ప్రభుత్వ దవాఖానలను కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఎంపిక చేస్తుంది. ఇందులో భాగంగా లేబర్ రూమ్కు రూ. రెండు లక్షలు, ఆపరేషన్ థియేటర్కు రూ.3 లక్షల చొప్పున ప్రోత్సాహకాలను అందించనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దవాఖానలు ఎంపిక కాగా ఇందులో కామారెడ్డి ప్రభుత్వ ఏరియా దవాఖాన ఒకటిగా నిలిచింది.