బాన్సువాడ , అక్టోబర్ 11 : పేదల జీవితాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన బిల్లులు సకాలంలో చెల్లించాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. బాన్సువాడ పట్టణంలోని ఆయన స్వగృహంలో హౌసింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.10 వేల కోట్లను కేటాయించిందని తెలిపారు. అందులో భాగంగా హడ్కో సంస్థ నుంచి రూ. వెయ్యి కోట్లు రుణంగా తీసుకోవడానికి గృహ నిర్మాణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం గ్యా రంటీ ఇచ్చిందని అన్నారు. ఆ రుణానికి సంబంధించిన ఫైల్పై సోమవారం సీఎం కేసీఆర్ సంతకం చేశారని తెలిపారు. బాన్సువాడ నియోజక వర్గానికి మొత్తం పదివేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరయ్యాయని.. ఇందులో 5 వేల ఇండ్లు నిర్మాణం పూర్త యి గృహప్రవేశాలు సైతం జరిగాయన్నారు. మిగ తా ఇండ్లు పురోగతిలో ఉన్నాయని వివరించారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇండ్లకు సం బంధించి ఇప్పటి వరకు రూ.120 కోట్ల బిల్లు లు రావాల్సి ఉందని తెలిపారు. మొత్తం బిల్లుల నిధులను విడుదల చేయాలని సీఎం కేసీఆర్, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి విన్నవించడంతో అంగీకరించారని చెప్పారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించుకుంటు న్న, పూర్తయిన లబ్ధిదారుల వివరాలను వెంటనే ఆన్లైన్ చేసి బిల్లులకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. లబ్ధిదారుల బిల్లులు మరో రెండు రోజుల్లో హౌసింగ్ శాఖ ద్వారా ఖాతాల్లో పడుతాయని స్పీకర్ వివరించారు. ఆయన వెంట టీఆర్ఎస్ (బీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, పీఆర్ ఈఈ ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్, సొసైటీ అధ్యక్షుడు ఏర్వా ల కృష్ణారెడ్డి, దేశాయిపేట్ సర్పంచ్ శ్రావణ్ కుమా ర్, పత్తి రాము, అరుణ్, పీఆర్ డీఈలు, ఆయా మండలాల ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు.