ఖలీల్వాడి, అక్టోబర్ 27 : నిజామాబాద్ నగరాన్ని పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశామని, మరోసారి ఆశీర్వదిస్తే ప్రజలకు మరింత సేవచేస్తానని అర్బన్ ఎమ్మెల్యే బిగాల కోరారు. నగరంలోని 35, 36 డివిజన్ల పరిధిలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. హమాల్వాడీ, నామ్దేవ్వాడలో ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను ఓటర్లకు వివరించారు. ప్రచారంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సూదం రవిచందర్, సుజిత్సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, బొబ్బిలి మురళి, ధాత్రిక పరమేశ్వర్, ఎర్రం గంగాధర్, కరిపె రాజు, మాదని శ్రీధర్, ఆర్ఎల్ నరసింహ, కోవూరి జగన్, చిదుర శ్రీను, అరవింద్సింగ్ పాల్గొన్నారు.
ఖలీల్వాడి, అక్టోబర్ 27 : నిజామాబాద్ నగరంలో ప్రతి కులసంఘానికీ నిధులు మంజూరు చేశామని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. పెద్దమ్మతల్లి దీవెనలతో ప్రజలకు మరింత సేవ చేస్తానన్నారు. శుక్రవారం నగరంలోని విజయలక్ష్మీ గార్డెన్లో ముదిరాజ్, శ్రావ్య గార్డెన్లో రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో బిగాల పాల్గొని మాట్లాడారు. ముదిరాజ్ల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నగరంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. నాగారం ప్రాంతంలో ముదిరాజ్ల ఆరాధ్యదైవమైన పెద్దమ్మతల్లి ఆలయాన్ని రూ. 50 లక్షలతో నిర్మిస్తున్నామని చెప్పారు. గోనెరెడ్డి సంఘానికి రూ. 25లక్షలు మంజూరు చేశామన్నారు. వివిధ కమిటీల్లో రెడ్లకు ఉన్నత పదవులు కట్టబెట్టినట్లు తెలిపారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఐక్యంగా ఉంటే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం ముదిరాజ్ సంఘ సభ్యులు గణేశ్గుప్తాకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన కాపీని ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, నగర మేయర్ దండు నీతూకిరణ్, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.