పిట్లం, ఫిబ్రవరి 19: కులాంతర వివాహం చేసుకున్న మూడు జంటలకు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు రూ. 2.5 లక్షల బాండ్లను మండలకేంద్రంలోని ఏఎంసీ ఆవరణలో సోమవారం పంపిణీ చేశారు. అనంతరం ఆరోగ్యశాఖ, ఎస్సీ డెవలప్మెంట్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారిణి రజిత, సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి లియో, మండల అధికారులు పాల్గొన్నారు.
జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులు కలెక్టర్ను కలిశారు. తమకు త్వరగా డబ్బులు అందేలా చూడాలని కోరగా, కలెక్టర్ స్పందించి భరోసా కల్పించారు.