నిజామాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారతీయ జనతా పార్టీ నేతలకు నిత్యం నోటికొచ్చినట్లు మాట్లాడడం పరిపాటిగా మారింది. సోషల్ మీడియాలో లేదంటే టీవీ వార్తల్లో నిలిచేందుకు నోరు జార డం, ఆ వెంటనే కనిపించకుండా తప్పించుకోవడం అలవాటుగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించి పారిపోవడమూ నిత్యం జరుగుతున్నదే. జనం బాగుకోసం ఏనాడూ పల్లెత్తు మాటెత్తకుండా… లోక్సభ సభ్యులంటే కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితం అన్న చందంగా బీజేపీ రాజకీయం మారింది. నిజామాబాద్ లోక్సభ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఓ వైపు… కరీంనగర్ ఎంపీ, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ మరోవైపు.. ఇరువురు చేసే వ్యాఖ్యలపై సభ్య సమా జం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. తాజాగా మరోమా రు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సభ్య సమాజం తలవంచుకునే విధంగా మహిళా నాయకురాలిపై పరుష పదజాలం ప్రయోగించడం తీవ్ర వివాదాస్పదమవుతున్నది. బీఆర్ఎస్కు చెం దిన మహిళా నాయకురాళ్లు తీవ్ర స్థాయిలో బండి సంజయ్ తీరును విమర్శిస్తున్నారు. ఎమ్మెల్సీ కవితకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేదంటే చెప్పు దెబ్బలు తప్పవం టూ హెచ్చరిస్తున్నారు.
బండి సంజయ్ తీరును నిరసిస్తూ శనివారం దేశ రాజధాని ఢిల్లీ నుంచి మొద లు పెడితే గల్లీ దాకా నిరసనలు హోరెత్తా యి. బీఆర్ఎస్ కార్యకర్తలంతా రోడ్డెక్కి బీజేపీ అధ్యక్షుడి తీరుకు నిరసనగా ఆందోళనలు చేశారు. బండి సంజయ్ దిష్టిబొమ్మలను ఆయా చోట్ల దహనం చేశారు. బండి సంజయ్ తీరు మార్చుకో… అంటూ ఘాటుగా హెచ్చరించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో బండి సంజయ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. కవితపై అమర్యాదగా మాట్లాడిన బండి సంజయ్ను ప్రజల్లో తిరగనివ్వమంటూ ప్రకటించారు. బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ అనర్హుడంటూ పలువురు వ్యా ఖ్యానించారు. బాధ్యతాయుతమైన పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూనే ఓ పార్టీ ఎమ్మెల్సీపై విచక్షణ మరిచి మాట్లాడడం బండి సంజయ్ వెర్రితనానికి నిదర్శనమని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒకే తీరులో ప్రతిపక్షాలు ఏలుతున్న రాష్ర్టాల్లో శాంతి భ ద్రతల సమస్యలను కావాలనే సృష్టిస్తున్నాయని గులాబీ నేతలు చెబుతున్నారు. బీజేపీ నేతలు ఇకపై నోరు అదుపు లో పెట్టుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడే సభ్యత మరిచి ప్రవర్తిస్తోన్న పార్టీలో కింది స్థాయి లీడర్లు కూడా అదుపు తప్పి సమాజానికి కళంకం తెస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్విందైనా, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అయినా…ఇరువురి తీరు నిత్యం వివాదాస్పదమే. ఆధారాల్లేకుండా బురద జల్లడం. రాజకీయాల్లోకి ఆయా ప్రజా ప్రతినిధుల కు టుంబాల పేర్లను ఎత్తుకోవడం.. అవసరమైతే దిగజారి విమర్శలు చేయడం, కుటుంబంలోని పిల్లలను వదలకుండా ఆరోపణలు చేసి పైశాచికత్వం పొందడం బీజేపీ నేతలకే చెల్లింది. వీరి తర్వాత కాంగ్రెస్ పార్టీలోని పలువురు నాయకులకు సైతం ఈ రకమైన రుగ్మత పట్టి పీడిస్తోంది. దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతున్న భారత రాష్ట్ర సమితి ఎదుగుదలను ఓర్వలేకనే బీజేపీ తీరు ఆక్షేపనీయంగా మారుతున్నదని ప్రజలు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన సభతో పాటు మున్ముందు తలపెట్టిన పక్క రాష్ర్టాల్లోని విస్తరణ కార్యక్రమాలతో బీజేపీలో వణుకు పుడుతు న్నది. అందులో భాగంగానే లేనిపోని ఆరోపణలతో ప్రజల దృష్టి మరల్చే ప్ర యత్నమేనని తెలుస్తోంది. బండి సంజ య్ గతంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించిన సమయాల్లోనూ ఇదే విధంగా ప్రవర్తించి బీఆర్ఎస్ నాయకుల నిరసన సెగలను ఎదుర్కొన్నాడు. బాన్సువాడలో అనైతికంగా ఓ చిన్నారితో రాజకీయం చేసి నవ్వులపాలైనప్పటికీ కాషాయ పార్టీలో మార్పు లేకపోవడం విడ్డూరంగా మారింది.
ఈడీ నోటీసుల నేపథ్యంలో విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవితకు ధైర్యం చెప్పేందుకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లారు. సీఎం కేసీఆర్ నివాసంలో కవితను కలిసి ధైర్యం చెప్పారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి శుక్రవారమే ఢిల్లీకి పయనం కాగా కవితను కలిసి బీజేపీ నీచ రాజకీయ నీతిపై మండిపడ్డారు. మరోవైపు భారత రాష్ట్ర సమితిపై కేంద్రం అవలంబిస్తున్న కక్షసాధింపు చర్యలు, కవితకు ఈడీ నోటీసుల అంశంపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ శనివారం ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవితకు సంఘీభావంగా ట్వీట్ పోస్టు చేశారు. పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడతాయి. అంత మాత్రానా… వేట ఆపుతామా? అంటూ మంత్రి వేముల వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులమైన మేమందరం, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలంతా మీ ధర్మ పోరాటంలో మీతో పాటు ఉన్నాం… ఉంటాం కూడా అంటూ చెప్పారు. ధర్మం మీ వైపు ఉంది. అంతిమ విజయం మీదే… మనదే అంటూ మంత్రి ట్వీట్ చేశారు.
కమ్మర్పల్లి, మార్చి 11 : ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసి న వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. సంజయ్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ మహిళా ప్రజాప్రతినిధిపై ఆ వ్యాఖ్యలు చేయడం బండి సంజయ్ అహంకారానికి నిదర్శనమన్నారు. మంత్రి వేముల పిలుపు మేరకు బండి వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం బాల్కొండ నియోజక వర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. బండి సంజయ్ దిష్టి బొమ్మలను దహనం చేశారు.
ఎమ్మెల్సీ కవితను అవమానించేలా మాట్లాడిన బండి సంజయ్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి. సంజయ్ ఇంట్లో ఆడబిడ్డల లేరా.. వారి గురించి ఇలానే మాట్లాడుతారా. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలి. మహిళలు తలుచుకుంటే బీజేపీకి పుట్టగతులు ఉండవు. బండి సంజయ్ ఖబడ్డార్.
-గుల్లె లావణ్యాగంగాధర్, సర్పంచ్ ఏర్గట్ల.
బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితను అవమానించేలా వ్యాఖ్యనించడం సరికాదు. ఆయన మాటలు యావత్ మహిళాలోకాన్ని అవమానించేలా ఉన్నాయి. మహిళా లోకానికి బీజేపీ ఇస్తున్న మర్యాద ఏ పాటిదో అర్థమవుతుంది. బండి సంజయ్ బేషరతుగా ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పాలి. లేదంటే తగిన గుణపాఠం చెబుతాం.
-జక్కని సంధ్యామధుసూదన్,మాజీ ఎంపీటీసీ, ఏర్గట్ల.
అక్రమ కేసులు బనాయించడమే కాకుండా ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఆడబిడ్డ అని చూడకుండా మహిళా సమాజాన్నే అవమానించేలా మాట్లాడడం సిగ్గు చేటు. కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.
-ఎనుగందుల అమితాపూర్ణానందం,
మోర్తాడ్,ఏర్గట్ల ఉమ్మడి మండలాల మాజీ జడ్పీటీసీ.
మహిళలపై బండి సంజయ్ ఇష్టరాజ్యంగా మాట్లాడడం సరికాదు. సంజయ్ ఇంట్లో మహిళలు లేరా.! వారి విషయంలో ఇతరులు ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా. బీజేపీకి చెందిన మహిళలకు ఇలాంటివి జరిగితే ఆ బాధ తెలిసి వస్తుంది. ఇప్పటికైనా సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలి.
-ఆకుల సుజాత, మాజీ మేయర్
తెలంగాణ ఆడబిడ్డ ఎదుగుదలని ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారు. ఎమ్మెల్సీ కవిత ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకుంటే ఆమెపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తారా. వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి.
-చాంగూబాయి, మాజీ కార్పొరేటర్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను ఢీకొట్టలేక ఎమ్మెల్సీ కవితపై విరుచుకుపడుతున్నా రు. ఈడీ కేసులు అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బండి సంజయ్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలి. లేదంటే తీవ్రపరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
-గంగామణి, బీఆర్ఎస్ నాయకురాలు