ఫిబ్రవరి 29 నుంచి ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఇంతకాలం పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్షలు ముగియడంతో ఆనందంతో ఇంటిబాట పట్టారు. ఉమ్మడి జిల్లాలోని పరీక్షా కేంద్రాలతోపాటు కళాశాలలు,
వసతి గృహాల్లో విద్యార్థుల కేరింతలతో సందడి వాతావరణం నెలకొన్నది. స్నేహితులతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు తీసుకుంటూ బైబై చెప్పుకొన్నారు. విద్యార్థులు స్వస్థలాలకు తరలివెళ్లడంతో వారి తల్లిదండ్రులు, బంధువులతో బస్టాండ్ల వద్ద రద్దీ ఏర్పడింది.
-స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్