నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 11: బాన్సువాడ నియోజకవర్గంలో అడిగిన వారందరికీ అవసరమైన పను లు మంజూరుచేశానని, వచ్చే ఎన్నికల్లో తనను మం చి మనసుతో ఆశీర్వదించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. నియోజక వర్గంలోని 225 గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరుచేసినట్లు పేర్కొన్నారు. మండలంలోని హాజీపూర్, సంగెం గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించి రూ.12 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ.. తొ మ్మిదేండ్లుగా బాన్సువాడ నియోజకవర్గంలో సాగునీటి కోసం రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూరుచేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో రూ.30కోట్లతో 300 అదనపు తరగతి గదులు నిర్మించినట్లు చెప్పారు. రూ.12 కోట్లతో 110 అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలను నిర్మించినట్లు తెలిపారు. అంకోల్ క్యాంపు నుంచి హాజీపూర్ గ్రామం వరకు రూ.9 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. చేసే పనులకు మాత్రమే హామీ ఇస్తున్నామని, చేసిన అభివృద్ధిని మాత్రమే చెబుతున్నామని తెలిపారు. పూర్వ కాలంలో రాజులు వ్యవసాయం కోసం చెరువులు తవ్వించారని, లోకంలో మంచి చేయడానికి దేవాలయాలు నిర్మించారని తెలిపారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలనలో కూడా సాగునీటి వనరులు అభివృద్ధి చేయడం, ఆలయాల నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు.
తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల కాలంలో తవ్వించిన గొలుసుకట్టు చెరువులను రూ. 7 వేల కోట్లతో మిషన్ కాకతీయ పథ కం ద్వారా మరమ్మతులు చేయించినట్లు తెలిపారు. సమైక్య పాలనతో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి నిధులు రాక ఇబ్బందులు పడేవాళ్లమని, స్వరాష్ట్రంలో ఒక్క గ్రామానికే కోట్ల రూపాయలు వస్తున్నాయని తెలిపారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. దేశంలో ఏ రాష్ట్రంలో అమలుచేస్తున్నారో చూపితే.. తాను శాశ్వతంగా రాజకీయాలను వదులుకుంటానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మాదిరిగా దేశంలో ఏ సీఎం లేడన్నారు. 70 ఏండ్ల నుంచి పాలించిన ముఖ్యమంత్రులు ఏం చేశారని ప్రశ్నించారు. గతంలో కరెంటు లేక పంటలు ఎండిపోయి అన్నమో రామచంద్ర అనేవాళ్లమని అన్నారు.
పండించిన పంటను కొనే దిక్కు లేక నష్టానికి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునేవాళ్లమని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుందని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. దేశంలోని మన రాష్ట్రంలో మాత్రమే 57 ఏండ్ల వారికి వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నట్లు తెలిపారు.
బాన్సువాడలోని సాయికృపానగర్లో రూ.25 లక్షల తో చేపట్టనున్న కురుమ సంఘ భవన నిర్మాణానికి స్పీకర్ పోచారం భూమిపూజచేశారు. ఈ సంద ర్భంగా కురుమ కుల పెద్దలు మాట్లాడు తూ..అన్ని తానై తమకు సహాయ సహకారాలు అందిస్తున్న స్పీకర్ పోచారం వెంటే తామంతా ఉంటామని తెలి పారు. నియోజకవర్గ పరిధిలోని 47 గ్రామాల కురుమ కుల పెద్దలందరం స్పీకర్ను కలిసి ఏకగ్రీవ తీర్మానం కాపీని అందజేస్తామని పేర్కొన్నారు.