మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగిందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 19,670 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందన్నారు. దీంతో ఉదయం 11 గంటలకు వరద కాలువ నుంచి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామన్నారు. కాకతీయ కాలువకు 6 వేలు, ఎస్కేప్గేట్లనుంచి దిగువ గోదావరిలోకి 1500 క్యూసెక్కులు, సరస్వతీ కాలువకు 800, లక్ష్మి కాలువకు 80 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతుందన్నారు. ప్రస్తుత సంవత్సరం ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి 302.900 టీఎంసీల వరద నీరు వచ్చిందన్నారు.
ఈ సీజనులో దిగువ కాలువలకు, మిగులు జలాలు 231.024 టీఎంసీల నీటిని గోదావరిలోకి విడుదల చేశామన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1090.90అడుగులు (89.763 టీఎంసీల) నీటి నిల్వ ఉందని ఏఈఈ తెలిపారు.