మెండోరాః శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి 80,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 11 వరద గేట్ల నుంచి దిగువ గోదావరిలోకి 49,920 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 1500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) సామర్థ్యం కాగా శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1090.80 అడుగులు (89.212 టీఎంసీల) నీటినిల్వ ఉందని వివరించారు.
కాకతీయ కాలువకు 6 వేలు, సరస్వతీ కాలువకు 800 , లక్ష్మి కాలువకు 80, అలీసాగర్ ఎత్తిపోతల పథకానికి 180 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ సీజనులో ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 602.692 టీఎంసీల వరద నీరు వచ్చిందని వెల్లడించారు.