మెండోర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి 40 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఏఈఈ రాము తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి వరద గేట్లు మూసివేసి దిగువకు నీటివిడుదలను నిలిపివేశామని తెలిపారు. రిజర్వాయర్లోకి వరద ఎక్కువగా వచ్చి చేరితే ఉన్నతాధికారుల ఆదేశాలతో దిగువకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు . ఈ సీజనులో ప్రాజెక్ట్ లోకి ఎగువ ప్రాంతాల నుంచి 629.576 టీఎంసీల వరద నీరు వచ్చిందని పేర్కొన్నారు. ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 1500 క్యూసెక్కులు నీటి విడుదల కొనసాగుతుందన్నారు.
కాకతీయ కాలువకు 6 వేలు, సరస్వతీ కాలువకు 800, లక్ష్మి కాలువకు 80, గుత్ప ఎత్తి పోతల పథకానికి 135 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతుందని వివరించారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీల) సామర్థ్యం కాగా బుధవారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1090.70 అడుగులు (88.662 టీఎంసీల) నీటి నిల్వ ఉందని తెలిపారు.