మోర్తాడ్/ఏర్గట్ల, డిసెంబర్ 26: ఊసరవెల్లిలా పార్టీలు మారుతున్న సునీల్రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులు హితవు పలికారు. చరిత్రలో నిలిచిపోయేలా బాల్కొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న మంత్రి ప్రశాంత్రెడ్డిని బద్నాం చేస్తే ఊరుకునేది లేదని సునీల్రెడ్డిని హెచ్చరించారు. మోర్తాడ్ బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా మాట్లాడారు. ఏర్గట్లలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన రూ.3లక్షల 76 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన చేసిన సందర్భంగా ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజాపూర్ణనందం మాట్లాడారు.
పాలెంలో ఇటీవల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ప్రశాంత్రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకునేలా ఒకరికి మద్యం తాగించి ఉసిగొల్పడంతోపాటు అతనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని అబద్ధాలు మాట్లాడించడం వంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవా లన్నారు. మంత్రికి దక్కుతున్న ఆదరాభిమానాన్ని చూసి ఓర్వలేకనే ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు, కార్యకర్తలు, నాయకులు చూస్తూ ఊరుబోరని హెచ్చరించారు. రోజుకో పార్టీ మారుతున్న సునీల్రెడ్డిని తాము అడ్డుకోవడం మొదలుపెడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. పాదయాత్రలు, పరామర్శల పేరిట డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. అభివృద్ధి గురించి ప్రశ్నించాలనుకుంటే నేరుగా మంత్రినే కలిసి మాట్లాడాలన్నారు. తప్పుడు ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు.
మోర్తాడ్లో ఏఎంసీ వైస్ చైర్మన్ పాపాయి పవన్, వైస్ఎంపీపీ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కల్లెం అశోక్, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు ఎనుగందుల అశోక్, సర్పంచ్ సంతోష్, ఎంపీటీసీ రాజ్పాల్, ఉప సర్పంచ్లు చొక్కాయి గంగారెడ్డి, పలిగిరి రవి, మాజీ సర్పంచులు అజీజ్, రాజేందర్, శ్రీనివాస్, రమేశ్, హన్మంతు పాల్గొన్నారు. ఏర్గట్లలో నిర్వహించిన సమావేశంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు జక్కని మధుసూధన్, సర్పంచులు గుల్లే లావణ్య, పత్తిరెడ్డి ప్రకాశ్రెడ్డి, కుండ నవీన్, మండల కో-ఆప్షన్ సభ్యుడు అష్రాఫ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు లింగారెడ్డి, మండల కన్వీనర్ సున్నపు అంజయ్య, నాయకులు అశిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, బద్దం శ్రీనివాస్రెడ్డి, గద్దె గంగారాం, సహదేవ్ పాల్గొన్నారు.