పిట్లం/ఆర్మూర్/ఖలీల్వాడి/బాన్సువాడ/మోపాల్(ఖలీల్వాడి), నవంబర్ 6: బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అన్ని వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లోకి వస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు వందల సంఖ్యలో సోమవారం గులాబీ పార్టీలో చేరారు. పిట్లం మండలం బండపల్లి, బొల్లక్పల్లి గ్రామాలకు చెందిన 50 మంది జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన షిండే.. కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆర్మూర్ పట్టణ పరిధిలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన 30మంది యువకులు, షాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ యూత్ నాయకులు, ఇస్సాపల్లి గ్రామ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే అంకాపూర్లోని తన నివాసం వద్ద గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మామిడిపల్లి మాజీ సర్పంచ్ రవిగౌడ్, బీఆర్ఎస్ నాయకులు మల్యాల నర్సారెడ్డి, శ్రీకాంత్చారి పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని 33వ డివిజన్కు చెందిన 200 మంది మహిళలు ఎమ్మెల్యే బిగాల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నగర మేయర్ నీతూకిరణ్, అంబదాస్, నవీద్ ఇక్బాల్, అబ్దుల్ ఖుద్దూస్, అక్బర్ హుస్సేన్, బబ్లూ, సగ్గి విజయ్ పాల్గొన్నారు. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన 20 మందికిపైగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి వచ్చారు. బాన్సువాడ పట్టణంలోని స్పీకర్ ఇంటి వద్ద కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భాస్కర్రెడ్డి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ నారాయణరెడ్డి, నాయకులు నారాయణరెడ్డి, రాజిరెడ్డి, ప్రవీణ్రెడ్డి, సాయిలు, రమేశ్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగర పరిధిలోని గూపన్పల్లి కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి బాజిరెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వేల్పూర్, నవంబర్ 6 : నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు నీరడి భాగ్య బీఆర్ఎస్లో చేరారు. ఆమెకు మంత్రి ప్రశాంత్రెడ్డి వేల్పూర్లో గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వేల్పూర్ జడ్పీటీసీ, ఎంపీపీగా పనిచేసిన ఆమెకు బాల్కొండ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. డైనమిక్ లీడర్గా పేరున్న భాగ్య పార్టీకి గుడ్బై చెప్పడంతో కాంగ్రెస్కు భారీ నష్టమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.