ధర్పల్లి/నిజామాబాద్ రూరల్/డిచ్పల్లి/ బాల్కొండ/ నవీపేట/ వేల్పూర్/ ముప్కాల్, డిసెంబర్ 6 : ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని మండల వ్యవసాయాధికారులు రైతులకు సూచించారు. మంగళవారం జిల్లాలోని పలు మండలాల్లో రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ధర్పల్లి మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయిల్పామ్ సాగుపై వైస్ ఎంపీపీ కె.నవీన్రెడ్డి, ఏవో ప్రవీణ్ అవగాహన కల్పించారు. ఆయిల్పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, లాభాలను ఈ సందర్భంగా రైతులకు వివరించారు. ఆసక్తి ఉన్న రైతులు సబ్సిడీపై మొక్కలను పొందేందుకు ఏఈవోలు లేదా గ్రామపంచాయతీల్లో సంప్రదించాలని సూచించారు. సర్పంచ్ నీరడి పుష్పాసుబేందర్, ఏఈవో మనోజ్, నాయకులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని కొండూర్ గ్రామంలో ఏవో హీరాజాదవ్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. యాసంగి సీజన్లో మండలానికి వంద ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. సర్పంచ్ అశోక్, ఎంపీవో మధురిమ, ఏపీవో పద్మ, ఏఈవో జ్ఞానేశ్వర్రెడ్డి, జీపీ కార్యదర్శి ఉమా పాల్గొన్నారు. డిచ్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో ఆయిల్పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీలను ఏవో దేవిక రైతులకు వివరించారు. సర్పంచ్ సురేశ్, ఎంపీటీసీ పద్మ, సొసైటీ చైర్మన్ అన్వేష్రెడ్డి, ఎంపీంవో యూసుఫ్ఖాన్, ఏపీవో రవి, ఏవీవోలు, ప్రీయూనిక్ ఆయిల్ పామ్ కంపెనీ ఇన్చార్జి నవీన్ పాల్గొన్నారు.
నవీపేట్ మండలంలోని నాగేపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సదస్సులో మండల వ్యవసాయశాఖ అధికారి సురేశ్గౌడ్ పాల్గొని మాట్లాడారు. ఆయిల్పామ్ పండించే రైతులు రూ.1000 డీడీ చెల్లిస్తే ఎకరానికి 50 మొక్కలను అందజేసి, సబ్సిడీపై డ్రిప్ సిస్టం పరికరాలను అందజేస్తామన్నారు. సర్పంచ్ స్వరూపా మహిపాల్, ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీ,ఎంపీవో రామకృష్ణ,ఏఈవో వసంత్, గ్రామ రైతులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని బోదేపల్లి గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల వ్యవసాయాధికారి మహేందర్రెడ్డి పాల్గొన్నారు.
ఆయిల్పామ్ పంట సాగు కోసం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం రాయితీ, చిన్న సన్నకారు రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం రాయితీపై మొక్కలను అందజేస్తుందన్నారు. ఏపీవో ఇందిర, సర్పంచ్ నోముల రవి, ఎంపీవో వెంకటేశ్వర్లు, రైతుబంధుసమితి గ్రామ కో-ఆర్డినేటర్ సామ గంగాధర్, ఏఈవో నిహారిక, సెక్రటరీ వనిత, వీఆర్ఏ రాజేశ్వర్, రైతులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం అంక్సాపూ ర్ గ్రామంలో మండల వ్యవసాయాధికారి నర్సయ్య ఆధ్వర్యంలో అవగాహన సదస్సుతోపాటు క్షేత్ర సందర్శన చేపట్టారు. కార్యక్రమంలోసర్పంచ్ ఎడ్ల రాజేశ్వర్రెడ్డి, ఎంపీటీసీ రవీందర్రెడ్డి, వీఆర్బీఎస్ కో-ఆర్డినేటర్ రాములు, ఏపీవో అశోక్, ఎంపీవో జావిద్అలీ, ఏఈవోలు, పంచాయతీ కార్యదర్శి, రైతులు పాల్గొన్నారు. ముప్కాల్ మండలంలో ని నాగంపేట్ గ్రామంలోని రైతులకు ఆయిల్పామ్ సాగుపై ఏవో రాజ్కుమార్ అవగాహన సదస్స నిర్వహించారు.