ఖలీల్వాడి, నవంబర్ 11 : నగరంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 45వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల హేమలత టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీలో చేరగా.. ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎమ్మెల్సీ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.