డోంగ్లీ, జనవరి 18: పదేండ్లపాటు కాంగ్రెస్ జెండా మోశానని, పార్టీ కోసం కష్టపడి పని చేసిన తనను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కక్షతోనే సస్పెండ్ చేయించారని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గజానంద్ పాటిల్ ఆరోపించారు. మండల
కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ తనకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా
నిర్వర్తించానని, ఎన్నికల్లో ఇచ్చిన డబ్బులు, మందు ప్రతి గ్రామశాఖ అధ్యక్షుడికి అందించానని, తాను ఇవ్వలేదని నిరూపిస్తే
దేనికైనా సిద్ధమేనని అన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలను గంగారాం వర్గమంటూ పక్కన పెడుతున్నారని, ఇది సమంజసంకాదన్నారు. పార్టీ కోసం పనిచేసే వాళ్లను గుర్తించాలని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన వెంట తంబాకే నాగనాథ్ ఉన్నారు. ఇదిలా ఉండగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గజానంద్పాటిల్ ఎన్నికల్లో పార్టీకి విరుద్ధంగా పనులు చేశారని సస్పెండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సురభీ దివేది ఉత్తర