నమస్తే తెలంగాణ యంత్రాంగం, నవంబర్ 26 : జిల్లావ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాకేంద్రంలోని పూలాంగ్ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పోలీస్ కమిషనర్ నాగరాజు, నగర మేయర్ దండు నీతూ కిరణ్.. ఎస్సీ సంఘాల ప్రతినిధులతో కలిసి పూలమాలలు వేశారు. మాలమహానాడు, ఇతర సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ర్యాలీని సీపీ నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు.
జడ్పీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఫూలాంగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, దండు శేఖర్, యెండల ప్రదీప్, శ్రీనివాస్గౌడ్, తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు అపర్ణ, సునీత, శోభ పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం ప్రవేశపెట్టిన బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి టీఆర్ఎస్కేవీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి పూలమాల వేసి మాట్లాడారు. కార్యక్రమంలో నవాతే ప్రతాప్, చంద్రమోహన్, అక్తర్ఖాన్, సరిత, వనజ, లావణ్య, పాల్గొన్నారు.
జక్రాన్పల్లి మండలకేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీపీ కుంచాల విమలారాజు, తహసీల్దార్ మల్లేశ్, ఎంపీడీవో లక్ష్మణ్ పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేశారు.
నిజామాబాద్ రూరల్ మండలం మల్లారంలో బీజేపీ, ఎస్సీ మోర్చా నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సిరికొండ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి గోసంగి సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లెల సాయిచరణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హంగర్గాఫారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఎజాజ్ఖాన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు.
ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లిలో జ్ఞానసరస్వతీ పాఠశాలలో అంబేద్కర్ చిత్రపటానికి ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సాంబారి ప్రమీలా మోహన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇందల్వాయి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రమేశ్ నాయక్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాములు నాయక్, ఎంపీవో రాజ్కాంత్రావు, సిబ్బంది పాల్గొన్నారు.
నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో సీపీ నాగరాజు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. సీపీ నాగరాజు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు, ఏసీపీలు, ఆర్ఐ, సీపీ కార్యాలయ సిబ్బంది, హోంగార్డులు, స్కూల్ విద్యార్థులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.
జిల్లాకేంద్రంలోని నూతన కలెక్టరేట్లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది భారత సంవిదాన్కు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి పనిచేయాలని అన్నారు.
నిజామాబాద్ న్యాయస్థానంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
బోధన్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని న్యాయస్థానంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. 1వ వార్డులో స్థానిక కౌన్సిలర్ తాళ్ల లతతోపాటు పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
బోధన్ పట్టణంలోని శ్రీ విజయసాయి హైస్కూల్లో రాజ్యాంగంపై విద్యార్థులు, ఉపాధ్యాయులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఎస్.కృష్ణమోహన్ మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. సాంఘికశాస్త్రం ఉపాధ్యాయులు శివకుమార్, అహ్మద్, కైలాస్, అస్మిత తదితరులు పాల్గొన్నారు.
బోధన్ మండలం అమ్దాపూర్ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. ప్రిన్సిపాల్ హిమబిందు, ఉపాధ్యాయులు ఉన్నారు.
మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామగ్రామాన అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, డీసీసీబీ డైరెక్టర్మోత్కు భూమన్న, రమేశ్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని డైరెక్టర్ పిల్లమర్రి శ్రీనివాస్ సూచించారు. డైరెక్టర్ భోజన్న పాల్గొన్నారు.
రెంజల్ మండలంలో రాజ్యంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో అంబ్కేర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు సందేహాన్ని వినిపించి, ప్రతిజ్ఞ చేశారు.
నవీపేట మండల కేంద్రంతోపాటు మద్దేపల్లి తదితర గ్రామాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట తహసీల్దార్ వీర్సింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ, ఎంపీవో రామకృష్ణ, సూపరింటెండెంట్ శ్రీనివాస్రావు, ఏపీవో రాజేశ్వర్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బాల్కొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. జీపీ సిబ్బంది, గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. అంబేద్కర్ చేసిన సేవలు గుర్తు చేసి కొనియాడారు.
డొంకేశ్వర్ మండంలంలోని మారంపల్లి గ్రామంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సంఘం యువజన నాయకుడు బంటు రాజేశ్వర్ మాట్లాడారు. అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మాక్లూర్ మండలం దాస్నగర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా కళాశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. గిరిరాజ్ కళాశాల పొలిటికల్ సైన్స్ విభాగం అధ్యాపకురాలు అనసూర్య ముఖ్యఅతిథిగా హాజరై భారత రాజ్యాంగం, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రాజ్యాంగంపై విద్యార్థినులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభచూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ లావణ్య, వైస్ప్రిన్సిపాల్ వాసవీలత, సి.స్రవంతి, సంపూర్ణ, డాక్టర్ శిరీష, శివరంజని, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఏర్గట్ల మండలం తడ్పాకల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. సర్పంచ్ పత్తిరెడ్డి ప్రకాశ్రెడ్డి, ఉపసర్పంచ్ లోలపు అశోక్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్ యాదవ్, ఎస్ఎంసీ చైర్మన్ ఎనుగందుల శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.