ఇందల్వాయి, ఏప్రిల్ 14: రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సూచించారు. ఆదివారం ఆయన మండలంలోని గన్నారం కమాన్ వద్ద ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.రైతులు దళారులను నమ్మి మోసపోకూడదన్నారు. ఇప్పటివరకు వరి ధాన్యం ఎంత కొనుగోలు చేశారని నిర్వాహకులను అడిగి తెలుసుకొన్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు చింతలపల్లి గోవర్ధన్రెడ్డి, నవీన్గౌడ్, ఇమ్మడి గోపి, కోరట్పల్లి ఆనంద్, చిన్నముత్తెన్న తదితరులు ఉన్నారు.