విద్యానగర్/దోమకొండ, డిసెంబర్ 9: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కామారెడ్డి నియో జకవర్గంలో సోమవారం విస్తృతంగా పర్య టించారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా ల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డు నుంచి ఎల్లమ్మ దేవాలయం వరకు, నిజాంసాగర్ రోడ్డు దేవునిపల్లి నుంచి లింగాపూర్ వరకు రూ. 8 కోట్ల 22 లక్షల 70 వేల నిధులతో పూర్తిచేసిన డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందూప్రియ, పార్టీ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
దోమకొండలో సింగిల్విండో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రమాదంలో మృతిచెందిన బీఆర్ఎస్ కార్యకర్త సయీద్ కుటుంబానికి బీమా చెక్కును అందజేశారు. అంచనూరులో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. సంగమేశ్వర్లో డాక్టర్ జలగం తిరుపతిరావు తన తండ్రి జ్ఞాపకార్థం నిర్మించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఎంపీపీ శారద, జడ్పీటీసీ తిర్మల్గౌడ్, సింగిల్ విండో చైర్మన్ నాగరాజురెడ్డి, సర్పంచులు అంజలి, సమత, ఉపసర్పంచ్ శ్రీకాంత్, సీడీసీ చైర్మన్ నర్సయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గండ్ర మధుసూదన్రావు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, నాయకులు నాగరాజు, స్వామిగౌడ్, రవి, శ్రీనివాస్ పాల్గొన్నారు.