బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలోని శ్రీరాం నారాయణ్ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటు హక్కు ప్రాధాన్యతపై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఓటు అనే ఆంగ్ల అక్షరాల ఆకృతిలో విద్యార్థులు కూర్చొని ఓట్ ఫర్ ఇండియా అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గంగాధర్, అధ్యాపకులు విఠల్, శంకర్రావు, కృష్ణ, చిరంజీవి, శ్రీదేవి, అనిత, పద్మ, రేఖ, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
-బాన్సువాడ రూరల్, మార్చి 15