భిక్కనూరు, డిసెంబర్ 10 : తెలంగాణను సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్వర్ స్థానంలో నిలబెట్టారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. పార్టీ శ్రేణుల గౌరవాన్ని పెంపొందించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. మండల కేంద్రంలో శనివారం కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ప్రకటించడంతో కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వంలో వణుకు పుడుతున్నదని అన్నారు. అందుకే ప్రభుత్వ సంస్థలను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులపై దాడులకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న బీజేపీని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టే రోజులు దగ్గరే ఉన్నాయని అన్నారు. సమ్మేళనంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్రావు, ఎంపీపీ గాల్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, జడ్పీటీసీ పద్మ నాగభూషణంగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భగవంత్రెడ్డి, వైస్ చైర్మన్ హన్మంత్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ లింగాల కిష్టాగౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.