కామారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, కామారెడ్డి, బీబీపేట్, రాజంపేట, రామారెడ్డి మండలాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 6,539 మందికి 64 కోట్ల 87 లక్షల 23 వేల 800 రూపాయల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశామన్నారు.
ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని, ఆడపిల్లను మగ పిల్లవానితో సమానంగా పెంచాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్లల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దిన్, పున్న రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.