నదికి పెరుగుతున్న నీటి ప్రవాహం
రెంజల్, జూలై 5 : మండలం కందకుర్తి వద్ద గోదావరినదిలో మంగళవారం నీటి ప్రవాహం పెరిగింది. బాబ్లీ ప్రాజెక్ట్లో నిల్వ ఉన్న నీరు ఇటీవల గేట్లు ఎత్తడంతో ఎస్సారెస్పీకి చేరింది.
దీంతో నీటి ఉధృతి తగ్గుముఖం పట్టింది. తాజాగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో నదిలోకి వరద ప్రవాహం మొదలైంది. నదిలోని జ్యోతిర్లింగాలు నీట మునిగాయి. మండలంలో సోమవారం 13.2 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని తహసీల్దార్ రాంచందర్ తెలిపారు.