మోపాల్ (ఖలీల్వాడి)/ డిచ్పల్లి/ నిజామాబాద్ రూరల్/బాల్కొండ/మెండోరా/ఆర్మూర్/శక్కర్నగర్, జనవరి 14 : జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లోని పలు ఆలయాల్లో గోదాదేవి కల్యాణాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లిలో ఉన్న ఇందూరు తిరుమలలో గోదాదేవి కల్యాణం నిర్వహించారు. ఆలయ ఆస్థాన గాయకులు నందిని, ప్రేరణి, విజయ్, ప్రణతి, సాత్విక, వరుణ్, నగ్మ, మహేశ్ కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నర్సింహారెడ్డి, డీసీవో సింహాచలం, సర్పంచ్ సాయారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు రాములు, రవీందర్ యాదవ్, నర్సారెడ్డి, నరాల సుధాకర్, రమేశ్, భాస్కర్, లక్ష్మి, రాజేశ్వర్, మురళి, అరుణ్, అరవింద్, భూంరెడ్డి, చిన్నయ్య, ఎర్రోళ్ల సాయిలు, వేదపండితులు సంపత్ కుమారాచార్యులు, రోహిత్ కుమారాచార్యులు పాల్గొన్నారు.
ధనుర్మాస ముగింపు వేడుకల్లో భాగంగా డిచ్పల్లి మండలంలోని ధర్మారం(బీ)లో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కల్యాణాన్ని నిర్వహించారు. వేడుకలకు జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ నిర్వాహకులు జడ్పీ చైర్మన్ను సన్మానించారు. బ్రహ్మంగారి ఆలయం పక్కన శిథిలావస్థకు చేరిన రక్షిత ట్యాంకు పక్కన మరో ట్యాంకు నిర్మాణానికి చర్యలు చేపట్టడంతోపాటు పైప్లైన్ నిర్మాణానికి నిధులు మంజూరుచేస్తానని జడ్పీచైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రావుల బ్రహ్మానందం, ప్రతినిధులు సుబ్బారావు, నాయుడు ఆంజనేయులు, నాగేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, పిచ్చేశ్వర్రావు, నాగార్జున, ప్రధాన అర్చకులు చిరంజీవాచార్యులు, రాహుల్ త్రిపాఠి, సచిన్ త్రిపాఠి పాల్గొన్నారు.
డిచ్పల్లిలోని ఏడో పోలీస్ బెటాలియన్లో ఉన్న వేంకటేశ్వర ఆలయంలో గోదాదేవి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కమాండెంట్ సత్యశ్రీనివాస్రావు దంపతులు స్వామివారికి పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. బెటాలియన్ సిబ్బంది, కుటుంబసభ్యులు అన్నదానంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్ఐలు పి.వెంకటేశ్వర్లు, బి.అనిల్కుమార్, ఎం.నరేశ్, బి.వసంత్రావు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగాపూర్, శ్రీనగర్, తిర్మన్పల్లిలో ఉన్న రామాలయాల్లో గోదాదేవి కల్యాణాన్ని వేదపండితుల మంత్రోశ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలు, మంగళహారతులతో ప్రత్యేకపూజలు చేశారు.
బాల్కొండ మండలంలోని జలాల్పూర్ గ్రామంలో శ్రీరంగనాథ స్వామి ఆలయ ఆవరణలో రంగనాథ స్వామి గోదాదేవి కల్యాణం వైభవంగా నిర్వహించారు. కల్యాణం అనంతరం అన్నసత్రం నిర్వహించారు. కార్యక్రమానికి దాతలు తిరునాగిరి సూర్యప్రకాశ్, నీరడి హరికృష్ణ, జక్క నర్సారెడ్డి, జక్క శ్రీనివాస్, సాయిలు, పడకంటి గంగారెడ్డి సహకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ గడ్చంద కల్పన అనిల్, ఉప సర్పంచ్ లింబారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామంలో ఉన్న శ్రీకోదండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి, రంగనాయకుల కల్యాణం నిర్వహించారు.బోధన్ పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం గోదారంగనాథ స్వాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. బోధన్లోని రాకాసీపేట్కు చెందిన గూడ నాగిరెడ్డి- లక్ష్మీరాజ్యం దంపతుల ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో యజమానులుగా పెంటయ్యచారి, రమణారావు, అచ్చిరెడ్డి, రాధాకృష్ణ దంపతులు వ్యవహరించారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు.
ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలోని రామాలయంలో గోదా రంగనాయకుల కల్యాణాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. రామాలయ కమిటీ అధ్యక్షుడు, కౌన్సిలర్ గంగామోహన్చక్రు, గుద్దెటి రమేశ్, సభ్యులు పాల్గొన్నారు.