ఆర్మూర్ : హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ కేంద్ర కార్యాలయంలో శనివారం మహాత్మాగాంధీ, భారతదేశ మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, అధికారులతో కలిసి గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి వారు చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ మహత్ముల అడుగుజాడల్లో నడవాలని సూచించారు.
వారి త్యాగ ఫలితంగానే స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను పొందగలుగుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ యాదిరెడ్డి, జీయం విష్ణువర్ధన్, ప్రొక్యూర్మెంట్ మేనేజర్ చంద్రశేఖర్, హెచ్ఆర్డీ మేనేజర్ వెంకటరమణారెడ్డి, డీఈటీ ప్రద్యూమ్న తదితరులు పాల్గొన్నారు.