Kamareddy | కామారెడ్డి : ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త షేక్ కబీర్ను గంప శశాంక్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కబీర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న చికిత్స గురించి వైద్యులతో మాట్లాడారు. కబీర్కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
అనంతరం కబీర్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేసి, వారికి ధైర్యం చెప్పారు. కష్ట సమయంలో తాము, అలాగే బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.