బాల్కొండ, జనవరి 4: నేటి విద్యార్థులను జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానంద్రెడ్డి ఉమ్మడి జిల్లాలోని 11 ఉత్తమ పాఠశాలలకు అందించిన స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని పాఠశాలల్లో ఏనుగు దయానందరెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఏనుగు దయానంద్రెడ్డి తన వియ్యంకుడు కావడం, రిటైర్డ్ పీడీ ఇంద్రారెడ్డి తన మామ కావడం, వారిద్దరితోకలిసి పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. తన సంపాదనలో కొంతభాగం పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం జాతీయస్థాయిలో రాణించిన క్రీడాకారులను సన్మానించారు.
అనంతరం పారిశ్రామిక వేత్త ఏనుగు దయానంద్రెడ్డి, రిటైర్డ్ పీడీ ఇంద్రారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎన్వి.దుర్గాప్రసాద్, మండల విద్యాధికారి రాజేశ్వర్, తహసీల్దార్ వినోద్, ఎంపీడీవో సంతోష్కుమార్, సర్పంచ్ సునీత, వైస్ ఎంపీపీ శ్రీకాంత్, ఉపసర్పంచ్ షేక్ వాహబ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాగర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్, జనవరి 4: మండలంలోని అమీనాపూర్ గ్రామం వరకు బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు అమీనాపూర్ బీఆర్ఎస్ కార్యాలయాన్ని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, సర్పంచ్ రాజేశ్వర్, ఎంపీటీసీ గంగామణి, ఆర్టీఏ సభ్యుడు రేగుళ్ల రాములు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మెండోరా, జనవరి 4: పోచంపాడ్ గ్రామంలో (ఎస్సారెస్పీ) పాఠశాల అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఉపాధ్యాయులు, సర్పంచ్ మిస్బా, ఎంపీటీసీ జాన్బాబు, ఉపసర్పంచ్ సంపంగి సతీశ్ జ్ఞాపిక అందజేసి మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ నాగంపేట్ శేఖర్రెడ్డి, ఎంపీపీ బూరుకల సుకన్యా కమలాకర్, జడ్పీటీసీ గంగాధర్, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణా నవీన్గౌడ్, సర్పంచులు, ఉపసర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. పోచంపాడ్ గ్రామంలో పీఆర్టీయూ క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఈవో దుర్గాప్రసాద్, ప్రధానోపాధ్యాయులు ఎ.మనోహర్, ఉషారాణి, రహమాన్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్గౌడ్, మండల అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.