ఎల్లారెడ్డి రూరల్, ఏప్రిల్ 12: లింగంపేట్ మండలం కొండాపూర్తండాలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పలువురి నివాసపు గుడిసెలు కాలిపోయాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ శుక్రవారం పరామర్శించారు. కాలిపోయిన నివాసపు గుడిసెలను పరిశీలించారు.
అన్ని విధాలా ఆదుకుంటామని, అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దివిటి రమేశ్, మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, ఎంపీటీసీ గన్యానాయక్, రాజశేఖర్రెడ్డి, శ్రీకాంత్, నర్సింహులు, ఎంపీటీసీ సురేందర్, నాయకులు సత్యం, మహిపాల్రెడ్డి, మనోహర్, పర్వయ్య తదితరులున్నారు.