కామారెడ్డి, జనవరి 21: కామారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. షబ్బీర్ అలీకి కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది.
కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా షబ్బీర్ అలీ వ్యవహరించనున్నారు. షబ్బీర్ అలీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న షబ్బీర్ అలీ మరోసారి మంత్రి పదవి ఆశించగా ఆయన్ని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.