డిచ్పల్లి/ ధర్పల్లి/ కోటగిరి/ నిజామాబాద్ రూరల్/ రెంజల్/ మోర్తాడ్/ మాక్లూర్/ నందిపేట్/ ఏర్గట్ల/ బాల్కొండ, డిసెంబర్ 2 : ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని, ఆ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులు అన్నారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో శుక్రవారం అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించారు. ఆయిల్పామ్ సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం సబ్సిడీలను అందజేసి ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. సాగు చేసే విధానంపై వివరించారు.
డిచ్పల్లి మండలకేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులకు మండల వ్యవసాయాధికారి రాంబాబు అవగాహన కల్పించారు. ఎకరానికి 50 ఆయిల్ పామ్ మొక్కలు నాటాల్సి ఉంటుందని, రైతులు మొక్కకు రూ. 20 చొప్పున చెల్లించాలని, డ్రిప్ సిస్టమ్ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ రైతులకు 90 శాతం సబ్సిడీ అందిస్తుందని వివరించారు. ఎంపీడీవో గోపీబాబు, రైతుబంధు మండల సమితి అధ్యక్షుడు జీనియస్ నారాయణరెడ్డి, వ్యవసాయ విస్తీర్ణాధికారులు నృపేశ్కుమార్, వంశీకృష్ణ, ఆశ్రితారాజ్, భావన పాల్గొన్నారు.
ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీవో నటరాజ్, ఏవో ప్రవీణ్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. 3న మైలారం, 5న హోన్నాజీపేట్, 6న రామడుగు, 7న ధర్పల్లి, 8న దుబ్బాకలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. తహసీల్దార్ గంగాసాగర్, ఎంపీవో రాజేశ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, మండల కన్వీనర్ పీసు రాజ్పాల్రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ జీయర్ కిశోర్రెడ్డి పాల్గొన్నారు.
కోటగిరి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం ఏర్పాటు చేసి వ్యవసాయాధికారి శ్రీనివాస్రావు,అవగాహన కల్పించారు. సమావేశంలో ఇన్చార్జి ఎంపీడీవో మారుతి, ఏఈవోలు గౌస్, సందీప్, ఆస్మా, గంగాసాగర్ పాల్గొన్నారు.
జక్రాన్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో డిసెంబర్ 3 నుంచి 8వ తేదీ వరకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారిణి దేవిక తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కుంచాల విమలారాజు అధ్యక్షతన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో లక్ష్మణ్, ఎంపీవో యూసుఫ్ ఖాన్, ఏపీవో రవి, ఏఈవోలు పాల్గొన్నారు.
నిజామాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ అనిల్కుమార్, ఎంపీడీవో మల్లేశ్ మాట్లాడారు. శనివారం నుంచి రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించార. ఎంపీవో మధురిమ, ఏవో హీరాజాదవ్, హార్టికల్చర్ అధికారిణి సంధ్యారాణి, ఏపీవో పద్మ, నిజామాబాద్ సొసైటీ చైర్మన్ కొట్టాల రవీందర్, ముత్తకుంట్ల సొసైటీ మాజీ చైర్మన్ బాల్రాజ్, ఏఈవోలు పాల్గొన్నారు.
రెంజల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ మండలాల వ్యవసాయ విస్తరణ అధికారులతో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. జిల్లా ఉద్యానవన అధికారి నర్సింగ్దాస్ మాట్లాడారు.కార్యక్రమంలో జడ్పీటీసీ విజయ, రెంజల్ సర్పంచ్ రమేశ్కుమార్, నిజామాబాద్, బోధన్ ఏడీఏలు వాజిద్హుస్సేన్, సంతోష్, ఎంపీడీవో శంకర్, ఏవో లక్ష్మీకాంత్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ మౌలానా, మండల కన్వీనర్ కాశం సాయిలు, మండల నాయకులు పాల్గొన్నారు.
కమ్మర్పల్లి, మోర్తాడ్ మండల కేంద్రాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమ్గల్ ఏడీఏ మల్లయ్య, మోర్తాడ్ ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. కార్యక్రమాల్లో ఎంపీవోలు శ్రీధర్, శ్రీనివాస్, ఏవో లావణ్య, ఏవోలు విద్యానంద్, శకుంతల పాల్గొన్నారు.
ఆయిల్పామ్ పంట సాగుపై ఈనెల 3 నుంచి 8 వరకు అవగామన సదస్సుల నిర్వహిస్తామని బాల్కొండ మండల వ్యవసాయాధికారి మహేందర్రెడ్డి తెలిపారు. మండల స్థాయి అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తహసీల్దార్ వినోద్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్, సొసైటీ చైర్మన్ నాగులపల్లి సూరజ్, లింగాగౌడ్, ఎంపీవో వెంకటేశ్వర్లు, ఏపీవో ఇందిరా, ఏఈవోలు పాల్గొన్నారు.
మాక్లూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏఈవోలతో నిర్వహించిన సమావేశంలో వ్యవసాయాధికారిణి పద్మ మాట్లాడారు. మండలంలోని ఆయా గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపీవో శ్రీనివాస్, ఏఈవోలు రాజునాయక్, రంజిత్, ఉమాదేవి, రాజహాస, ఎంపీటీసీ వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.
నందిపేట్ మండల కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయశాఖ అధికారులు ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. మండల వ్యవసాయాధికారి జ్యోత్స్న, ఎంపీవో కిరణ్కుమార్, అయిలాపూర్ సొసైటీ చైర్మన్ సుదర్శన్, ఉమ్మెడ ఎంపీటీసీ మనోజ్రావు, ఐకేపీ, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఏర్గట్ల మండల కేంద్రంలో మండల వ్యవసాయాధికారి మహ్మద్ అబ్దుల్ మాలిక్, తహసీల్దార్ జనార్దన్, ఎంపీడీవో కర్నె రాజేశ్, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.