HomeNizamabadFarmers Want To Keep The Word Of The Board
పసుపు రైతుల ఆందోళన
పసుపునకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ మార్కెట్యార్డులో జిల్లా రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు
కొనుగోళ్లనువేగవంతం చేయాలి
కేంద్రం మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్
ఎంపీ అర్వింద్పై కర్షకుల ఆగ్రహం
‘బోర్డు’ మాట నిలబెట్టుకోవాలన్న రైతులు
ఖలీల్వాడి, ఫిబ్రవరి 14: పసుపునకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ మార్కెట్యార్డులో జిల్లా రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపునకు మద్దతు ధర ఇప్పిస్తానని చెప్పి, ఇప్పటి వరకు ఆ దిశగా కృషిచేయకపోవడం దారుణమన్నారు. దీంతో జిల్లాలోని పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. మార్కెట్ యార్డులో పసుపు కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. కొనుగోళ్లను వేగవంతం చేసి పసుపునకు మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్దతు ధరలేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని వారు కోరారు.
21 వరకు పసుపు పంటను తీసుకురావొద్దు
మార్కెట్ కమిటీ కార్యదర్శి విజయ్కిశోర్ మాట్లాడుతూ.. మార్కెట్కు పసుపు పంట 25 వేల బస్తాలు వచ్చిందని తెలిపారు. ఈ 17 వరకు విక్రయించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 21వ తేదీ వరకు పంటను తీసుకురావద్దని సూచించారు. పసుపు బాగా ఎండబెట్టిన తర్వాతే తీసుకురావాలన్నారు.