నస్రుల్లాబాద్, ఏప్రిల్ 19: బీర్కూర్ మండల కేంద్రంలో విక్రయించిన నకిలీ విత్తనాలతో రైతులు మోసపోయిన విషయం తెలిసిందే. నకిలీ విత్తనాలతో సాగుచేసిన పంటలను కొన్ని రోజుల క్రితం వ్యవసాయశాఖ అధికారులు, గ్రోమోర్ కంపెనీ వారు పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఈ నెల 12వ తేదీలోగా నష్ట పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. గడువు ముగిసి వారంరోజులు గడుస్తున్నా నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం గ్రోమోర్ దుకాణానికి తాళం వేసి ఆందోళన చేశారు.