మాక్లూర్ : యాసంగిలో కూడా తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోందని, అన్నదాతలు అధైర్యపడోద్దని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రమైన మాక్లూర్లో మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు 17శాతం తేమ వచ్చే విధంగా చూసుకోవాలని, చెన్నీ పడితే నష్టపోయే అవకాశం ఉండదని అన్నారు. మండలంలో గతంలో 18 కొనుగోలు కేంద్రాలు ఉండగా ఈ సారి 22 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 4కేంద్రాలు ఐకేపీ మహిళల నిర్వహణకు కేటాయించామని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చే కమిషన్తో మహిళ సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్లు అశోక్రావు, గంగాధర్నాయక్, ఎంపీటీసీలు వెంకటేశ్వర్రావు, మీరాబాయి, కో-ఆప్షన్ సభ్యులు హైమద్, ఐకేపీ ఏపీఎం అనిల్కుమార్, సిసిలు గంగాబాబు, శ్రీధర్రెడ్డి, వివో కాంతారావు, నాయకులు మనోహర్రావు, నర్సాగౌడ్, మర్ల దత్తు, నారాయణ, తాజ్, పాషా, ప్రకాశ్, ఒడ్డెన్న, మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.