నవీపేట, ఫిబ్రవరి 28: మండల కేంద్రంలోని ఎర్ర సాయన్న కిరాణ దుకాణం ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం చోరీకి గుర్తుతెలియని దుండగులు యత్నించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు దుండగులు ఏటీఎం మిషన్ను ధ్వంసం చేసే క్రమంలో మిషన్కు అమర్చిన సైరన్ మోగింది. 10 నిమిషాల వ్యవధిలోనే పోలీసులకు ముంబై నుంచి సమాచారం అందడంతో స్థానిక ఎస్సై యాదగిరిగౌడ్ తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి బయల్దేరారు.
పోలీసుల రాకను గమనించిన దుండగులు పారిపోయారు. ఘటనా స్థలాన్ని నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ సతీశ్కుమార్ పరిశీలించారు. నిజామాబాద్ నుంచి పల్సర్ బైక్ పై వచ్చిన దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసే ప్రయత్నం చేయగా, పోలీసుల రాకను గమనించిన దొంగలు మసీదు ఏరియా నుంచి బాసర వైపు పారిపోయినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయ్యింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు.