కోటగిరి/ ఎడపల్లి, ఫిబ్రవరి 13 : జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. కోటగిరి మండలకేంద్రంతోపాటు పొతంగల్లోని పాత పొతంగల్లో కంటి వెలుగు శిబిరాలు సోమవారం కొనసాగాయి. 13 రోజులుగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు, మందులను పంపిణీ చేసినట్లు డాక్టర్లు సుప్రియ, కరణ్ తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు కృష్ణవేణి, జ్యోతి, సాయికుమారి, ఏఎన్ఎంలు రోజా, శ్రీదేవి, మంజుల, శోభారాణి, సంగీత, ఆశకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
జక్రాన్పల్లి మండలంలోని తొర్లికొండ, నల్లగుట్ట గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలను ఎంపీడీవో లక్ష్మణ్ సోమవారం పరిశీలించారు. అనంతరం వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం తొర్లికొండలో సర్పంచ్, సెక్రటరీ, వార్డుసభ్యులతో కంటివెలుగు కార్యక్రమంపై రివ్యూ సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ఎడపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని సోమవారం ఎంపీడీవో గోపాలకృష్ణ పరిశీలించారు. ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ వినీత్ కుమార్రెడ్డి, కంటివైద్యుడు శ్రీకాంత్, పీహెచ్సీ డాక్టర్ రాజ్కుమార్, సూపర్వైజర్ బండ రాములు, ఏఎన్ఎం గంగామణి, ఆశ వర్కర్ రాజమణి ఉన్నారు.
ధర్పల్లి/శక్కర్నగర్, ఫిబ్రవరి 13: మైలారం గ్రామంలో కంటివెలుగు శిబిరాన్ని సర్పంచ్ రమేశ్ ప్రారంభించారు. అనంతరం శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. శిబిరాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ లలిత, శోభ, వార్డుసభ్యులు సోమ శేఖర్, ప్రవళిక, సంధ్యారాణి, స్రవంతి, గీత, గంగవ్వ, పద్మ, కార్యదర్శి ప్రవీణ్, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఉపసర్పంచ్ పాల్గొన్నారు.
కంటివెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోధన్ 4వ వార్డు కౌన్సిలర్ డేగావత్ ధూప్సింగ్ నాయక్, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 3వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధాకృష్ణ కోరారు. శక్కర్నగర్లోని బాలుర వసతిగృహంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. ముందుగా ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. వార్డులోని ప్రజలకు కంటి పరీక్షలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.