బాన్సువాడ/ బాన్సువాడ టౌన్, ఫిబ్రవరి 4: బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో దివంగత పరిగె పాపమ్మ, రాజారెడ్డి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు పరిగె శంభురెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్న ప్రో కబడ్డీ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. శనివారం రాత్రి ఈ పోటీలను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తిలకించారు. ముందుగా వారి తల్లిదండ్రులైన దివంగత శ్రీ పరిగె పాపమ్మ-రాజిరెడ్డి చిత్రపటాల వద్ద నివాళులు అర్పించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. పోటీలో భాగస్వాములైనందుకు క్రీడాకారులు, పీఈటీలు, కామారెడ్డి కబడ్డీ సమాఖ్య సభ్యులను ఈ సందర్భంగా సభాపతి అభినందించారు. సభాపతి వెంట మున్సిపల్ చైర్మన్ జం గం గంగాధర్, సరస్వతీ ఆలయ ధర్మకర్త పరిగె శంభురెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ మోహన్ నాయక్ ఉన్నారు.
ప్రో కబడ్డీ పోటీల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 16 జట్లు పాల్గొన్నాయి. ఉదయం కామారెడ్డి పోలీసుశాఖకు చెందిన జట్టు, కన్కల్ జట్టు మధ్య జరిగిన పోటీలను నిర్వాహకులు శంభురెడ్డి, ఏఎస్పీ అన్యోన్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కబడ్డీ పోటీలను ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం సెమిస్, ఫైనల్ మ్యాచ్లు ఉంటాయన్నారు. ప్రథమ బహుమతి రూ.30 వేలు, ద్వితీయ బహుమతి రూ.20 వేలు, తృతీయ, నాల్గో బహుమతి రూ. 10 వేలు అందించనున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబర్చిన ఉత్తమ రైడర్, ఉత్తమ డిఫెండర్కు బహుమతులను అందిస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జగన్నాథ రెడ్డి, పట్టణ, రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, మురళి, కృష్ణ, ఎస్సైలు రంజిత్ రెడ్డి, దత్తాత్రి గౌడ్, జడ్పీటీసీ పద్మా గోపాల్ రెడ్డి, మహ్మద్ ఏజాస్, ప్రశాంత్ రెడ్డి, దొడ్ల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు హకీం, బాడి శ్రీనివాస్, రుక్మిణి, కిరణ్, వెంకటేశ్, మోతీరామ్ ,నర్సుగొండ, హైమద్ తదితరులు పాల్గొన్నారు.