బోధన్, మార్చి 7: బోధన్లోని శ్రీ చక్రేశ్వర శివమందిరం మట్టి తవ్వకాల్లో బయటపడింది. 1959 ఫిబ్రవరి 7 (అమావాస్య)రోజున ఒక రైతు మట్టిదిబ్బను చదునుచేస్తుండగా… నల్లని రాతితో ప్రకాశవంతమైన శివలింగం, గర్భగుడి, పైన శిఖరంతో చెక్కు చెదరని రీతితో బయటపడింది. బోధన్కు ఏకచక్రపురం అనే పేరు ఉండడంతో ఇక్కడి శివలింగానికి ఏకచక్రేశ్వరుడు, చక్రేశ్వరుడు అని పేర్లు పెట్టారు. త్రేతాయుగంలో రాక్షస సంహారం కోసం బయల్దేరిన పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడన్న స్థల పురాణం ఈ ఆలయానికి ఉన్నది.