ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమయ్యింది. పరీక్షలు ఈ నెల 28 నుంచి మార్చి 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 54,855 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే విద్యార్థుల హాల్టికెట్లను విడుదల చేశారు. పరీక్షల నిర్వహణ మొత్తం సీసీ కెమెరాల నిఘాలోనే జరగనున్నది. ఈసారి కూడా నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు.
ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో కలెక్టర్లతోపాటు నోడల్ అధికారులు సమావేశాలు నిర్వహించారు. పరీక్షా సెం టర్ల వద్ద విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, రవాణా, కరెంటు సౌకర్యాలపై అన్నిశాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కామారెడ్డి జిల్లాలో 19,509 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రథమ సంవత్సరానికి 9,993 మంది, ద్వితీయ సంవత్సరంలో 9,516 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, మొత్తం 37 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కామారెడ్డి పట్టణంలో 12 సెంటర్లను ఏర్పాటు చేయగా, అందులో మూడు ప్రభుత్వ, తొమ్మిది ప్రైవేట్ క ళాశాలల్లో ఏర్పాటు చేశారు. 55 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 10 మంది అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు, ముగ్గురు సిట్టింగ్ స్కాడ్, ఇద్దరు ఫ్లయింగ్ స్కాడ్లను నియమించారు. జీపీఆర్ఎస్ ద్వారా మూడు సెట్లను పోలీస్ స్టేషన్లలో భద్రపరచనున్నారు. ఐదుగురు కస్టోడియ న్స్, 750 మందికి పైగా ఇన్విజిలేటర్లను నియమించనున్నారు.
జిల్లాలో మొత్తం 35,346 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్ 14,965, వొకేషనల్ 2,399, ద్వితీయ సంవత్సరం జనరల్ 13,986, ప్రైవేట్ 1804, వొకేషనల్ రెగ్యులర్ 1999, ప్రైవేట్ 193 మంది పరీక్షలు రాయనున్నారు.
పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు గంట ముందే చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 8.15 నుం చి 9 గంటల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైన వారికి అనుమతించబోమని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు సమీపంలో జిరాక్సు సెంటర్లను మూసివేయనున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, అందుబాటులో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తారు.
ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రా ల్లో బోర్డు అధికారులు సీసీ కెమెరాలను ఏర్పా టు చేశారు. సీసీ కెమెరా ఎదుటే ప్రశ్నపత్రాలను విడుదల చేయడం, సమాధాన పత్రాలను సీల్ చేయడం వంటివి కొనసాగుతాయి. పరీక్షలకు మూడు,నాలుగు రోజులుగా ముందుగా సమీప పోలీస్ స్టేషన్ల నుంచి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను సరఫరా చేసే బాధ్యత కస్టోడియన్లకు అప్పగిస్తారు. పరీక్ష కేంద్రాలను గుర్తించేందుకు సెంటర్ లొకేటర్ యాప్ను రూపొందించారు. హాల్టికెట్ నమోదు చేస్తే విద్యార్థి ఉన్న ప్రదేశం నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉన్నది.. అక్కడికి ఎలా చేరుకోవాలనేది ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకునే అవకాశం ఉన్నది.
ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశాం. మాస్ కాపీయింగ్కు తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాలోకి అనుమతించబోం. విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందే సెంటర్కు చేరుకోవాలి.