గాంధారి/ సదాశివనగర్, అక్టోబర్ 9: సీఎం కేసీఆర్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. సోమవారం ఆయన గాంధారి మండల కేంద్రంలో పర్యటించారు. నూతనంగా నిర్మించిన ప్రాథమిక సహకార సంఘ భవనంతోపాటు రూ.10 కోట్లతో చేపట్టిన డబుల్ రోడ్డు, డివైడర్, సెంటర్ లైటింగ్ను ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యే జాజాల తాడ్వాయి మండల కేంద్రంలో 81 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. సదాశివనగర్ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్నాయక్, ఎంపీపీ రాధా బలరాం, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణరావు, గాంధారి, గండివేట్ సర్పంచులు మమ్మాయి సంజీవ్,అబ్దూల్ ఫారూక్, సింగిల్ విండో చైర్మన్ పెద్దబూరీ సాయికుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శివాజీరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ రెడ్డి రాజు, ఎంపీటీసీ పత్తి శ్రీనివాస్, ఎంపీటీసీలు సారిక, ఉమారాణి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సదాశివనగర్ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఎంపీపీ అనసూయ, జడ్పీటీసీ నర్సింహులు, సర్పంచులు పైడి జానకి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, బడాల భాస్కర్ రెడ్డి, సాయవ్వ రాములు, ఎంపీసీలు సంకరి లక్ష్మీ రాజలింగం, ఎడ్ల రేణుక నర్సింహులు, రాంచందర్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్గం సాయిరెడ్డి, విండో చైర్మన్లు సదాశివరెడ్డి, కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.