వినాయక్ నగర్ : ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో (Electric auto) దగ్ధమైన (Fire) ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది. నిజామాబాద్ (Nizamabad) నగరంలోని ధర్మపురి హిల్స్ ప్రాంతానికి చెందిన ఎండి ముస్తోద్దిన్ అనే వ్యక్తి ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేశాడు. ప్రతిరోజు మాదిరిగానే ఆయన బుధవారం రాత్రి ఇంటి ముందు ఆటోకు ఛార్జింగ్ కోసం ఎలక్ట్రిక్ వైర్ను అమర్చాడు.
కొద్ది సమయం తరువాత ఆటోలోంచి మంటలు రావడానికి గమనించిన స్థానికులు ఆయనకు సమాచారం ఇచ్చారు. ఆటో యజమాని బయటికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆటో పూర్తిగా దగ్ధమైపోయింది. ఆటో దగ్ధానికి బ్యాటరీ ఓవర్ ఛార్జింగ్ కావడమా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా తెలియాల్సి ఉందని బాధితుడు పేర్కొన్నాడు.