నస్రుల్లాబాద్, ఏప్రిల్ 23 : కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు. సీనియర్ కార్యకర్త అయిన దొంతి శంకర్ ఆరు నెలల క్రితం మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన సందర్భంగా వారు గుడిసెలో నివాసం ఉండడాన్ని గమనించిన స్పీకర్.. తక్షణమే డబుల్ బెడ్ రూం మంజూరు చేయించారు. ప్రత్యేక దృష్టి సారించి ఇంటిని పూర్తి చేయించారు. ఆదివారం గృహప్రవేశం కార్యక్రమానికి స్పీకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకర్ కుటుంబ సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, ఎంపీపీ విఠల్, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు మాజిద్, నాయకులు ప్రతాప్సింగ్, రాము, కంది మల్లేశ్, లక్ష్మీనారాయణగౌడ్, ఖలీల్ పాల్గొన్నారు.