నిజామాబాద్ క్రైం, ఆగస్టు 2 : చిన్న చిన్న అవసరాల కోసం లోన్ యాప్లలో లోన్ తీసుకొని విలువైన ప్రా ణాన్ని పణంగా పెట్టకూడదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కి కాల్ చేస్తే డబ్బులు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా సీజ్ చేయవచ్చని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, స్మార్ట్ ఫోన్ వినియోగం ద్వారా ప్రజల అమాయకత్వం, అత్యాశను ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు రోజుకో రకంగా దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలియజేశారు.
బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఏటీఎం కార్డుల నంబర్లు ఇతర వివరాలు అడగడం, పర్సనల్ లోన్ అప్రూవ్ అయ్యిందని అందు కు కొన్ని వివరాలు చెబితే రూ.50 వేల నుంచి లక్ష వర కు మీకు ఖాతాలో జమవుతాయని మోసగాళ్లు నమ్మిస్తారన్నారు. అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. లోన్లు తీసుకొని ప్రాణాలను పణం గా పెట్టవద్దని సీపీ కోరారు. లాటరీలో బహుమతులు గెలుచుకున్నారని మాయ మాటలు చెప్పి బ్యాంకు ఖా తాలను ఖాళీ చేస్తున్నారని, ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఉన్న వారిని మోసం చేస్తున్నారని తె లియజేశారు. సైబర్ మోసానికి గురైతే 1930, డయల్100 లేదాwww.cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న నగదును తిరిగి పొందడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను చూసి ఎటువంటి వస్తువులు కొనవద్దని, అలాగే వ్యక్తిగత వివరాలను వివాహ సంబంధిత వెబ్సైట్లో సైతం ఉంచకూడదని సూచించారు.