కామారెడ్డి, మార్చి 13 : జిల్లా వ్యాప్తం గా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ముగిశాయి. బుధవారం మొదటి సంవత్సర కెమిస్ట్రి, కామర్స్ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 సెంటర్లలో పరీక్షలు నిర్వహించా రు.
మొత్తం జనరల్ 8,347 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 8,021 మంది హాజరయ్యారు. 326 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ 1,463 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 1,298 మంది హాజరయ్యారు. 165 మంది గైర్హాజరయ్యారని ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.
మద్నూర్, మార్చి 13: మద్నూర్ జూనియర్ కాలేజీలోని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ బుధవారం తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్ జరుగకుండా చూడాలని ఇన్విజిలేటర్లకు ఆదేశించారు. కేంద్రం వద్దకు ఇతరులు రాకుండా చూసుకోవాలన్నారు.