నిజామాబాద్క్రైం, జనవరి 1: జిల్లా పోలీసులకు ఉత్తమ సేవా పథకాలు లభించాయి. విధుల్లో సత్తా చాటిన పోలీసులను ప్రభుత్వం ఏటా వివిధ పథకాలతో సత్కరిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈసారి కూడా పలువురికి సేవా పథకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ పి.సత్యనారాయణ మహోన్నత సేవా పథకానికి ఎంపికయ్యారు. అలాగే, ఉత్తమ సేవా పథకానికి నిజామాబాద్ అడిషనల్ డీసీపీ ఎస్. జయరామ్, ఏడో బెటాలియన్కు చెందిన ఏఆర్ ఎస్సై జి.లక్ష్మారెడ్డి ఎంపికయ్యారు.
ఇక, సీటీసీ ఏసీపీ సుబ్యమణ్యం శ్రావణ్కుమార్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సీఐ, ఎం.వెంకటసురేందర్రెడ్డి, సీటీసీ ఎస్సై ఆత్రం దేవ్రావు, సీఎస్బీ ఎస్సై కే.విఠల్. రూరల్ ఎస్సై జాదవ్ రామారావు, పోలీస్ పీసీటీ ఎస్సై డి.మహేందర్, బోధన్ టౌన్ ఎస్సై సీహెచ్.రామారావు, వీఆర్లో ఉన్న ఎస్సై గొల్ల ఎల్లయ్య, హెడ్క్వార్టర్స్ ఏఆర్ ఎస్సై హెచ్.నాగేశ్వర్, ఏర్గట్ల ఏఎస్సై సయ్యద్ ఇస్మాయిల్, వివిధ విభాగాలకు చెందిన హెడ్ కానిస్టేబుళ్లు వెంకటరమణ, జనార్దనరావు, రమణారెడ్డి, లక్ష్మణ్, అరుణకుమారి, రాములు, కానిస్టేబుళ్లు సతీష్, ఉషాశేఖర్లను ప్రభుత్వం సేవా పథకాలకు ఎంపిక చేసింది.