రెంజల్, ఏప్రిల్ 2 : మండలంలోని కందకుర్తి గ్రామం ఇందిరమ్మ కాలనీలో తాగునీటిని అందించడంలో నిర్లక్ష్యం వహించిన ఎంపీవో గౌసొద్దీన్, గ్రామ కార్యదర్శి సతీశ్చంద్రకు జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ మెమోలు జారీ చేశారు. పదిరోజులుగా కాలనీవాసులకు తాగునీరు సరఫరా కావడంలేదని, దీనికి ఎంపీవో, కార్యదర్శిని బాధ్యులను చేస్తూ మూడు రోజుల్లో వారు సంజాయిషీ ఇవ్వాలని మెమోలో పేర్కొన్నారు.