కోటగిరి, మార్చి 18 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంతో పాటు ఎత్తుండా క్యాంప్లో రంజాన్ పండుగను పురస్కరించుకొని నిరుపేద మైనారిటీలకు రంజాన్ తోఫా కిట్లను ఆయా గ్రామాల సర్పంచులు గైనీ వీరమణి, బర్ల మధుకర్, తహసిల్దార్ గంగాధర్ బుధవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ వీరమణి మాట్లాడుతూ రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఆమె సూచించారు. గ్రామంలో ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సునీల్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ ఉమా కాంత్, వార్డు సభ్యులు ఎక్బాల్, మోగ్లా తదితరులు ఉన్నారు.