నవీపేట/కమ్మర్పల్లి(మోర్తాడ్)/రెంజల్, ఏర్గట్ల,డిసెంబర్ 2: మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం బీపీ, షూగర్ వ్యాధి గ్రస్తులకు ఎంపీపీ సంగెం శ్రీనివాస్ ఎన్సీడీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్సీడీ మందుల కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని అన్నారు. నవీపేట మండలంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సర్వే చేసి 2632 మంది బీపీ, 1300 మంది షుగర్ వ్యాధి గ్రస్తులను గుర్తించినట్లు తెలిపారు. ప్రతి వ్యాధి గ్రస్తుడు ప్రభుత్వం సరఫరా చేస్తున్న కిట్లను మాత్రమే వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీ, నాయకులు నీరడి బుచ్చన్న, ఎంపీటీసీ మీనా నవీన్రాజ్, హెచ్ఈవో వెంకటేశ్వర్, సూపర్వైజర్లు దేవేందర్, పుష్ప, ఎన్సీడీ స్టాప్ నర్సు భూలక్ష్మి, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
కమ్మర్పల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో సంతోష్రెడ్డి, సర్పంచ్ గడ్డం స్వామి ఎన్సీడీ మందుల కిట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్ ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం మందుల కిట్లను అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి శాంతికుమార్, హెల్త్ సూపర్వైజర్ ఏస్తేరు. ఏఎన్ఎం కృష్ణవేణి, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
రెంజల్ మండల కేంద్రంలోని పీహెచ్సీలో సర్పంచ్ రమేశ్కుమార్, జడ్పీటీసీ విజయా సంతోష్ ఎన్సీడీ కిట్ల పంపిణీని ప్రారంభించారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎన్సీడీ మందులను ప్రతి నెలా ఆశ వర్కర్లు అందజేస్తారని తెలిపారు. ఆరోగ్య విస్తరణ అధికారులు కరిపె రవీందర్, శ్రావణ్కుమార్, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ సర్పంచ్ భీమనాతి భానుప్రసాద్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) గ్రామ శాఖ అధ్యక్షుడు బోనగిరి రమేశ్ వైద్య సిబ్బందితో కలిసి బీపీ, షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎన్సీడీ కిట్లను అందజేశారు. పంచాయతీ కార్యదర్శి భోజన్న, ఏఎన్ఎం శ్యామల, టీఆర్ఎస్(బీఆర్ఎస్ నాయకులు రాంపల్లి మురళి, దిబ్బ గంగాధర్, దేవదాసు, నవీన్, లక్ష్మణ్, ఆనంద్, కారోబార్ సాయిరాం, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.