బాల్కొండ, నవంబర్ 23: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం నాలుగు గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎంపీపీ లావణ్యా లింగాగౌడ్, జడ్పీటీసీ దాసరి లావణ్యా వెంకటేశ్, తహసీల్దార్ వినోద్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు సంతకుల సాయమ్మ – జువ్వన్న, నాగుల భూదేవి, పల్లి కిషన్, ఎంపీటీసీలు మామిడి దివ్య, రాకేశ్, కన్న లింగవ్వా పోశెట్టి, మండల కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఫయాజ్ అలీ, ఉపసర్పంచులు షేక్ వాహబ్, పస్తం చిన్నరాజన్న, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు తౌటు గంగాధర్, సొసైటీ చైర్మన్ నాగులపల్లి సూరజ్రెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, గ్రామశాఖ అధ్యక్షుడు సాగర్ యాదవ్, రైతుబంధు మండల కోఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్, వేల్పూర్ మార్కెట్ డైరెక్టర్లు వేంపల్లి చిన్న బాల్రాజేశ్వర్, సయ్యద్ మజారొద్దీన్, సొసైటీ డైరెక్టర్లు డాక్టర్ ప్రసాద్గౌడ్, మండల గంగారాం, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
మోర్తాడ్, నవంబర్23: అనారోగ్యంతో ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద బుధవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 22 మందికి రూ.18లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కల్లెం అశోక్, వైస్ఎంపీపీ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఎనుగందుల అశోక్, సర్పంచ్ మండల రాజేశ్వర్, ఉప సర్పంచులు మహేశ్, మల్లేశ్, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు లక్ష్మణ్, రమేశ్, హన్మంతు, గంధం మహిపాల్, గంగన్న, అజీస్ పాల్గొన్నారు.
మాక్లూర్, నవంబర్ 23: అనారోగ్యంతో బాధపడుతున్న ఒకరికి వైద్య చికిత్స నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.రెండు లక్షల విలువైన ఎల్వోసీని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్మూర్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామానికి చెందిన ఎస్.రమేశ్రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందించాలని అతడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డికు విన్నవించగా ఆయన స్పందించి ఎల్వోసీని మంజూరు చేయించారు. ఎల్వోసీని బుధవారం బాధిత కుటుంబానికి అందజేశారు.
రెంజల్, నవంబర్ 23: దూపల్లి గ్రామంలో పలువురికి బుధవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు సర్పంచ్ శనిగరం సాయిరెడ్డి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు శేషుగారి భూమారెడ్డి తెలిపారు. దుబ్బాక పుష్పలతకు రూ. 24వేలు, ఫరిదాబేగంకు రూ.10వేల చెక్కులను అందజేశామన్నారు. ఉప సర్పంచ్ సాయిలు, జీపీ కార్యదర్శి సాయిలు తదితరులు పాల్గొన్నారు.