Bags Distribution | రుద్రూరు : మాదాల చారిటబుల్ ట్రస్టు సిసిడి వర్ని ఆధ్వర్యంలో కూనీపూర్ గ్రామంలో ట్రస్ట్ మేనేజర్ ఠాగూర్ చేతుల మీదుగా ఆరో తరగతి నుండి పదో తరగతి విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పంచాయతీ కార్మికులకు శుక్రవారం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. మాదాల చారిటబుల్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు చైర్మన్ ఠాగూర్ ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ డాక్టర్ రాజారెడ్డి, భారత్ గ్యాస్ నరసయ్య, సొసైటీ మాజీ చైర్మన్లు గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, కాంతయ్య, కృష్ణారెడ్డి, లచ్చరెడ్డి, గంగారాం, సాయిలు, దేవయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు.